మొంథా తుఫాన్ (Montha Cyclone) కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, TPCC ఉపాధ్యక్షులు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
చారకొండ మండలం తుర్కలపల్లిలో సమీక్ష
ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు చారకొండ మండలం తుర్కలపల్లి గ్రామంలో MRO, MPDO, MPO, PR DE, పోలీస్ అధికారులతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు. వాగులు, వంకల్లో వరద ఉధృతిని దగ్గరగా పరిశీలించారు.
అధికారులకు, ప్రజలకు ఎమ్మెల్యే ఆదేశాలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అధికారులు మరియు ప్రజలతో మాట్లాడుతూ కీలక ఆదేశాలు, సూచనలు చేశారు:
ముంపు ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది.
ప్రజలు ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దు.
జాగ్రత్తలు: శిథిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో గాని, మట్టి ఇండ్లలో గాని, విద్యుత్ స్తంభాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి.
నిషేధం: ప్రజలు ఎవరూ కూడా చెరువులు, వాగులు ప్రవహిస్తున్న ప్రదేశంలోకి వెళ్లకూడదు.
సహాయక చర్యలు: రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్ సంబంధిత అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్నారని, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాలు తగ్గే వరకు ప్రజలందరూ ప్రభుత్వ అధికారుల సూచనలను పాటించాలని డాక్టర్ వంశీకృష్ణ గారు విజ్ఞప్తి చేశారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com