అచ్చంపేట:
ఈ నెల 28న అచ్చంపేట పట్టణంలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు BRS నాయకులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా అచ్చంపేట BRS పార్టీ సమన్వయకర్త, నాగర్ కర్నూల్ మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారు పలువురు మాజీ మంత్రులు, నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
మీడియా సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారితో పాటు మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ సభ విజయవంతం కోసం చేపట్టాల్సిన చర్యలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, BRS చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ సభ ఉపయోగపడుతుందని నాయకులు తెలిపారు.
మీడియా సమావేశం అనంతరం మర్రి జనార్దన్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి సభాస్థలిని పరిశీలించారు. సభకు వచ్చే కార్యకర్తలకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా పార్కింగ్, తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎడ్ల నర్సింహ గౌడ్, తులసీరాం నాయక్, కౌన్సిలర్లు కుత్బుద్దీన్, రమేష్ రావు, అంతటి శివ, నాయకులు అమీనొద్దీన్, కరుణాకర్ రావు, గణేష్ రావు, అంకూ సురేందర్, కోనేటి తిరుపతయ్య, ఖాజా, ఇతర పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
TAGS: BRS Coordinator Marri Janardhan Reddy, BRS press meet Achampet, former Ministers Niranjan Reddy, Srinivas Goud, Ex-MLA Jaipal Yadav, BRS Working President KTR, KTR meeting Achampet, Achampet political news, BRS Telangana updates, Nagarkurnool district politics, Telangana party events, BRS party inspection, Achampet constituency news, BRS leadership event, Telangana political meetings
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com