హైదరాబాద్, ధర్నా చౌక్:
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో నిట్ట నిలువుగా నట్టేట ముంచిందని, ఇది ప్రజలను అవమానించే పాలన అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ తీవ్రంగా విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ధర్నా చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రసంగంలో డీకే అరుణ చేసిన ప్రధాన ఆరోపణలు:
గ్యారంటీల మోసం: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అభయ హస్తం కాదని, ప్రజలపై పెట్టిన భస్మాసుర హస్తం అని ఆమె విమర్శించారు. అలవి కానీ హామీలతో మహిళలను మోసం చేశారని, ప్రతి మహిళకు నెలకు ₹2,500 ఇస్తామన్న మాట నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు.
రైతు బంధు కోత: రైతులకు ₹15,000 ఇస్తామని చెప్పి, ₹12,000లకు తగ్గించి, అందులోనూ అరకొర మందికే ఇచ్చింది వాస్తవం కాదా అని ఆమె నిలదీశారు.
అభివృద్ధిపై కేంద్ర నిధులు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి చూసి ఓటు వేయమని అడుగుతున్నారని, అయితే ఆ అభివృద్ధికి నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే అని గుర్తుంచుకోవాలని డీకే అరుణ అన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, అందుకే బీజేపీ అభిమానులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
పంచాయతీలకు నిధులు: కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు పైసా కూడా రేవంత్ రెడ్డి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఉపాధి పనులు, సీసీ రోడ్లు, కిసాన్ సమ్మాన్, ముద్ర లోన్లు వంటి అన్ని పథకాలు ఇస్తుంది కేంద్రమే అని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్లు: బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి, కనీసం 21% కూడా ఇవ్వలేదని ఆరోపించారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్కు విజయోత్సవాలు చేసుకునే అర్హత లేదన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సైతం బీసీలకు న్యాయం చేసేది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడ్ అని అన్నారని గుర్తు చేశారు.
దోపిడీ పాలన: ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ లక్షల కోట్లు దోపిడీ చేస్తే, కాంగ్రెస్ రియల్ ప్రాజెక్ట్ల పేరుతో లక్షల కోట్లు దోచుకుంటోందని ఆరోపించారు. హిల్ట్ (HILT) పాలసీని సైతం లక్షల కోట్లు జేబులో నింపుకునేందుకే తెచ్చారని విమర్శించారు.
మోసాలు, వ్యతిరేకత: శిశుపాలుడి తప్పులను శ్రీకృష్ణుడు లెక్కపెట్టినట్లు, రేవంత్ రెడ్డి మోసాలను తెలంగాణ ప్రజలు లెక్కపెడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదికే ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని డీకే అరుణ పేర్కొన్నారు.
ప్రధాని సహకారం: సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చి, నిధులు ఇస్తున్నారని, కానీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరే వరకు, ప్రజలను వంచించిన కాంగ్రెస్ దిగిపోయేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుందని డీకే అరుణ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
TAGS: DK Aruna Speech, BJP Maha Dharna Hyderabad, Revanth Reddy Govt Criticism, Telangana Sarpanch Elections, 6 Guarantees Betrayal, HILT Policy Corruption, DK Aruna BJP speech Hyderabad, BJP Maha Dharna Indira Park, Telangana Congress government criticism, Sarpanch elections Telangana, Abhaya Hastham vs Bhasmasura Hastham, DK Aruna on BC reservation, Telangana local body polls controversy, central funds for village development, HILT policy corruption Telangana, CM Revanth Reddy criticism BJP, DK Aruna, BJP Mahadharna, Congress Guarantees, Revanth Reddy, Bhasmasura Hastham, Rythu Bandhu, Central Funds, HILT Policy, Telangana News
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com