మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, అచ్చంపేట నియోజకవర్గంలో వరద సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. TPCC ఉపాధ్యక్షులు మరియు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ముంపు ప్రాంతాలకు చేరుకోవడానికి ట్రాక్టర్పై వెళ్లి మరీ పరిస్థితిని సమీక్షించారు.
మర్లపాడు తండాలో క్షేత్రస్థాయి పరిశీలన:
ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మర్లపాడు తండా గ్రామంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాలను ట్రాక్టర్పై ప్రయాణిస్తూ సందర్శించారు. ఆయనతో పాటు అధికారులు కూడా పర్యటనలో పాల్గొన్నారు.
ప్రజలు, అధికారులకు ఎమ్మెల్యే సూచనలు:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రజలు మరియు అధికారులతో మాట్లాడి, కీలక ఆదేశాలు మరియు జాగ్రత్తలు సూచించారు:
ప్రజలకు హామీ: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అప్రమత్తత: ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దు.
ప్రమాదకర ప్రాంతాలు: శిథిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో, మట్టి ఇండ్లలో, మరియు విద్యుత్ స్తంభాల దగ్గర ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
నిషేధం: ప్రజలు ఎవరూ కూడా చెరువులు, వాగులు ప్రవహిస్తున్న ప్రదేశంలోకి వెళ్లకూడదని స్పష్టం చేశారు.
అధికారులకు ఆదేశం: వివిధ వాగుల్లో వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్ సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు అధికారులను కోరారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com