- నల్గొండ మంత్రులకు ఉన్న ధ్యాస పాలమూరు మంత్రులకు లేదా? - రిజర్వాయర్లు పూర్తి కాకముందే ప్రాజెక్టు ప్రారంభం ఒక ఎలక్షన్ స్టంట్
హైదరాబాద్ (బషీర్ బాగ్): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ నిప్పులు చెరిగారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టును పక్కనపెట్టి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు నల్గొండ మంత్రులు చూపుతున్న ఆత్రుత వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
ప్రధాన విమర్శలు:
అసంపూర్తి ప్రాజెక్టు: నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ వంటి రిజర్వాయర్లు పూర్తి కాకముందే, 2023 ఎన్నికల కోసం మాజీ సీఎం కేసీఆర్ ప్రాజెక్టును ప్రారంభించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
నీటి తరలింపు కుట్ర: పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, నల్గొండ మంత్రులు పాలమూరు నీటిపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అన్ని ప్రాంతాలు సమానం కాదా అని ప్రశ్నించారు.
మంత్రుల మౌనం: గతంలో డిండి కోసం లేఖ రాసిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పుడు పాలమూరు ప్రయోజనాలపై మౌనం వీడాలని డిమాండ్ చేశారు.
వలసల భయం: పాలమూరుకు రావాల్సిన నీటిని తరలిస్తే, ఈ ప్రాంత ప్రజలు మళ్లీ వలస కూలీలుగా మిగిలిపోవాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రవీందర్ గౌడ్, మల్లేష్, గూడుషా, రాఘవేందర్ గౌడ్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. పాలమూరు రైతుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com